అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
NEWS Jun 19,2025 09:29 pm
అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే మేఘనీ నగర్లోని సివిల్ హాస్పిటల్ క్యాంపస్పై కుప్పకూలింది. ఈ దురదృష్టకర ఘటనలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే.