రేవంత్ రెడ్డి సీఎం కావడం వల్లే ఈ దారుణాలు బయటకు వచ్చాయి
NEWS Jun 19,2025 09:24 pm
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఉదంతంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్లే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసిందని ఆమె అన్నారు. ఒకవేళ గత ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే, ఈ విషయం బయటకు వచ్చేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.