విజయలక్ష్మి మృతిదేహానికి నివాళులుర్పించిన ఎమ్మెల్యే KSNS రాజు
NEWS Jun 19,2025 11:54 pm
బుచ్చయ్యపేట ఎంపిడివో వి.విజయలక్ష్మి మృతి చెందారు. 4 రోజుల క్రితం విశాఖపట్నంలో తన స్వగృహంలో కాలుజారి ప్రమాదవశాత్తు పడిపోవటం వల్ల తలకి బలమైన గాయం కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. మరణ వార్త సమాచారం తెలుసుకున్న మన చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు, డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, విశాఖపట్నం చేరుకొని ఎంపీడీవో విజయలక్ష్మి అకాల మృతికి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నమన్నారు.