పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి శాంతిభద్రతల సమస్య సృష్టించడం పట్ల మండిపడ్డారు. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.