పెద్దపల్లి నియోజకవర్గంలో యూరియా లేక రైతులు అవస్థలు పడుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే రైతుల పట్ల చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. పొలాలు నాటు వేసినప్పటి నుండి రెండు మార్లు యూరియా చల్లిన మరోసారి యూరియా చల్లుదామంటే దొరకని పరిస్థితి ఉందని పలువురు పేర్కొంటున్నారు. రాగినేడు ఎరువుల గోదాం ను సర్పంచ్ కుమార్ పరిశీలించారు. రైతుల సమస్యలపై MLA దృష్టికి తీసుకెళ్తామన్నారు.