ఫోన్ ట్యాపింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐడీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు దెబ్బకు అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. సోమవారం ఆయన సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. విచారణలో పలు కీలక అంశాలు బయట పడే ఛాన్స్ ఉందని పలువురు భావిస్తున్నారు.