బాబు కామెంట్స్ పై జగదీశ్ రెడ్డి కన్నెర్ర
NEWS May 31,2025 01:34 pm
హైదరాబాద్, తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. మోసానికి చిరునామా తను అంటూ ఆరోపించారు. పదే పదే హైదరాబాద్ ను తానే డెవలప్ చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2004లో చంద్రబాబు దిగి పోయేనాటికి సమైక్యాంద్ర తలసరి ఆదాయం 25,900 రూపాయలు మాత్రమేనని అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.