తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటు చేసిన కమిషన్ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ గడువును జూలై 31 వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు గత సర్కార్ పై. ఇందులో లక్ష కోట్ల అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు.