రూ. 344 కోట్లు సద్వినియోగం చేసుకోవాలి
NEWS May 19,2025 02:19 pm
ఇరిగేషన్ పనులు, నిర్వహాణ, మరమ్మత్తుల కోసం చంద్రబాబు విడుదల చేసిన రూ.344 కోట్లు సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రాజెక్టుల పనుల ప్రగతిపై సమీక్ష చేపట్టారు. ఓ అండ్ ఎం పనుల పై ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వందల, వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, డ్రైన్స్ నిర్మిస్తే గత ప్రభుత్వం మెయింటెన్స్ కూడా లేకుండా గాలికి వదిలేసిందంటూ ఆరోపించారు.