వర్షానికి నీట మునిగిన ప్రభుత్వ కార్యాలయాలు
NEWS May 19,2025 01:20 pm
ఆదివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ఇబ్రహీంపట్నం రెవెన్యూ కార్యాలయం, మండల అభివృద్ధి కార్యాలయాలలోకి భారీగా నీరు చేరడంతో కార్యాలయ సిబ్బంది పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంపీడీవో కార్యాలయం ముందు 2 అడుగుల లోతు నీరు నిలిచిపోవడంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.