భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ శ్రీనగర్ ను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. ఈఘటనలో డ్రోన్ల దెబ్బకు భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దీంతో లక్ష్యంగా చేసుకోవడంతో శ్రీనగర్, జమ్మూలో ఉన్న పలు విద్యా సంస్థల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శ్రీనగర్ ఎన్ఐటీ లో చదువుతున్నారు 300 మంది స్టూడెంట్స్. ఇందులో 10 మంది తెలుగు వారు ఉన్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. భారీ బందోబస్తు మధ్య విద్యార్థులను తరలించేందుకు ప్రయత్నం చేస్తోంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.