భారత్ ను కవ్విస్తున్న పాకిస్తాన్
NEWS May 10,2025 11:50 am
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది కల్నల్ సోఫియా ఖురేషి. రోజు రోజుకు పాకిస్తాన్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 24 చోట్ల ఫైటర్ జెట్స్ తో దాడికి యయత్నిస్తోందన్నారు. సరిహద్దుల వెంట భారీగా దాడులు చేపట్టిందన్నారు. శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిందన్నారు. ఈ సందర్బంగా త్రివిధ దళాలు గట్టిగా బదులు ఇస్తున్నామయని చెప్పారు.