ఉద్యోగులకు సెలవులు బంద్ - సీఎం
NEWS May 08,2025 06:54 am
తెలంగాణ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులకు సెలవులు బంద్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ భారత్ సింధూర్ ఆపరేషన్ చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో ఏర్పాటు చేసిన ఉగ్రస్థావరాలను మట్టు బెట్టింది. కీలక ఉగ్ర నేతలు హతం అయ్యారని సమాచారం.