సాయం కావాలంటే చేసేందుకు సిద్దం
NEWS May 08,2025 05:17 am
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ పరస్పర దాడులు చేసుకోవడం ఆపాలని కోరారు. ఏదైనా సహాయం చేయడానికి నేను రెడీ అంటూ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాలతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. తమ మధ్య సమస్యల్ని పరష్కరించు కోవాలని సూచించారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దాడులు నిర్వహించిందని, ఇకనైనా వాళ్లు ఆగుతారని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు.