రూపారెడ్డి హత్య కేసులో మైనర్లు అరెస్ట్
NEWS Aug 19,2026 09:11 pm
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు మైనర్ విద్యార్థులు ఆమె ఇంట్లో చోరీకి 5 రోజుల ముందే ప్లాన్ వేసి, ఈ నెల 11న ఇంట్లోకి ప్రవేశించిన వారిలో ఒకరిని రూపారెడ్డి గుర్తించడంతో, కత్తితో ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.1.54 లక్షల నగదు, ఐఫోన్, రూపారెడ్డి మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మైనర్లు కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డుకు తరలించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.