తెలంగాణ ఎన్నడూ పేదది కాదు
NEWS May 06,2025 04:59 pm
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నడూ పేదది కాదన్నారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న తను ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. దేశంలోనే అత్యధికంగా బియ్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని తెలుసుకుంటే మంచిదన్నారు. చేతకాక, అనుభవం లేక రాష్ట్ర ప్రజలను అవమానించడం పట్ల ఫైర్ అయ్యారు ఈటల.