ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.