జగిత్యాల జిల్లా భీమరం మండలం మన్నెగూడెం లో ప్రమాదవశాత్తు వరి కోత యంత్రం ఇంజన్లో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆ యంత్రానికి పూర్తి స్థాయిలో మంటలు వ్యాప్తి చెంది పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ యంత్రం పై నుండి దూకేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు వాపోయారు. చుట్టుపక్క రైతులు వచ్చి మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.