ఉగ్రదాడికి సహకరించిన కశ్మీరీల లిస్టు వెల్లడి
NEWS Apr 27,2025 03:13 pm
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ దాడి ఘటనలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరించిన 14 మంది స్థానిక కశ్మీరీల జాబితాను వెల్లడించింది. భారత నిఘా సంస్థలు అందించింది వివరాలను. మహ్మద్ ఆదిల్ రెహమాన్ డెంటు, ఆసిఫ్ అహ్మద్ షేక్, అహ్సన్ అహ్మద్ షేక్, హరీస్ నజీర్, అమీర్ నజీర్ వానీ, యావర్ అహ్మద్ భట్, ఆసిఫ్ అహ్మద్ ఖండే, నజీర్ అహ్మద్ వానీ, షాహిద్ అహ్మద్ కుటే, అమీర్ అహ్మద్ దార్, అద్నాన్ సఫీ దార్ , జుబేర్ అహ్మద్ వానీ, హరూన్ రషీద్ గనై, జాకీర్ అహ్మద్ ఘనీలను సహకరించినట్లు ప్రకటించింది. నిఘా సంస్థల ఆధారంగా దక్షిణ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి.