నటి జెత్వానీ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు. ఈ కేసుకు సంబంధించి తన కేసును తానే న్యాయవాది ముందు వాదించారు కోర్టులో. తన పాత్ర లేక పోయినా తనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. మాజీ డీజీపీ విశాల్ గన్నీని అప్రూవర్ గా మార్చి సంబంధం లేని విషయాలను చెప్పించారని ఆరోపించారు.