'శిలాక్షరం' పుస్తకావిష్కరణ కార్యక్రమం
NEWS Mar 08,2025 04:34 pm
రచయిత గన్నోజు ప్రసాద్ రాసిన 'శిలాక్షరం' పుస్తకావిష్కరణ, అంకితోత్సవ కార్యక్రమం హన్మకొండలోని సామ జగన్ మోహన్ భవన్లో ఆదివారం ఉ. 10:30కు జరగనుంది. కసిరెడ్డి వెంకటరెడ్డి పుస్తకావిష్కరణ చేస్తారు. DNR ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్డ ప్రతాప్ రెడ్డికి ఈ పుస్తకాన్ని అంకితమిస్తారు. తాడిచెర్ల రవి, దిలీప్ రావు, శ్రీనివాస్ రావు, శ్రీనివాస్, లక్ష్మయ్య, మహేందర్, అనురాధ, నాగారాజు, సునిత, మధుకర్, అమర్, ప్రముఖులు పాల్గొంటారు.