పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
NEWS Feb 15,2026 01:03 am
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్ వరల్డ్ క్రికెట్లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్, షోయబ్ ఆక్తర్ వంటి ఫాస్ట్ బౌలింగ్ను సచిన్ ధైర్యంగా ఎదుర్కొని భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. 23 ఏళ్ల తర్వాత ఈ మహా శివరాత్రి రోజే మరో భారత్–పాక్ పోరు జరగనుంది. కొలంబోలో జరిగే ఈ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోసారి భారత్ విజయం సాధించాలని దేశం ఆకాంక్షిస్తోంది.