హైదరాబాద్: 'నేనే రాజు నేనే మంత్రి' అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన చెప్పారు. గెలుపు, ఓటమి అన్నింటికీ తానే బాధ్యత తీసుకుంటాననే ఉద్దేశంలో చెప్పానని రేవంత్ వెల్లడించారు.