మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
NEWS Mar 08,2025 03:50 pm
జహీరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, జహీరాబాద్ ఇన్చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ఆదేశాలతో క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మహీళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్ మహీళలతో కలిసి మహీళ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగలలో మహిళలు సమాన పాత్ర పోషిస్తున్నారని, మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.