మెదక్ జిల్లా నర్సాపూర్ లో మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ మహిళా కార్మికులను ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపేందుకు మండలిలో కృషి చేస్తానని అన్నారు. ప్యారా నగర్ డంపు యాడు నిర్మాణాన్ని ఆపేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో బిజెపి నేతలు మురళీధర్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.