ఎట్టకేలకు ప్రభుత్వం నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా సాయి చైతన్య నియామకం అయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజాంబాద్ పోలీస్ కమిషనర్ గా 2016 ఐపీఎస్ బ్యాచ్ పోతరాజు సాయి చైతన్య ను నియమించింది. సాయి చైతన్య ప్రస్తుతం యాంటి నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పని చేస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కల్మేశ్వర్ బదిలీ తర్వాత గత ఐదు నెలలుగా కమీషనర్ పోస్ట్ ఖాళీగా ఉంది.