పెండింగులో ఉన్న ఆస్తి పన్నుల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు టాక్స్ డ్రైవ్ లో దూకుడుగా వ్వవహరిస్తున్నారు.జోన్ 2 పరిధిలోని బసప్ప వినాయక్ నగర్ ప్రాంతంలోని ఏడు షాపులను సీజ్ చేశారు. నగర శివారులోని ఖానాపూర్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఆస్తి పన్నులు బకాయి పడ్డ రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేశారు. పన్నులు చెల్లించేందుకు రెండు రోజులు గడువు ఇచ్చారు. రైస్ మిల్లుల కొలతల్లో భారీగా తేడాలుండటం కారణంగా కార్పొరేషన్ కు రావాల్సిన పన్నులు అరా తిశారు.