తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలంతా కలిసి సమావేశం నిర్వహించడం అభినందనీయమన్నారు. నేల నుంచి నింగి దాకా మహిళలు అద్భుతమైన ప్రతిభా పాటవాలతో దూసుకు వెళుతున్నారని అన్నారు. ఒకప్పుడు మహిళలు పని చేయాలంటే ఒకటి రెండు దారులు మాత్రమే ఉండేవన్నారు. కానీ ఇప్పుడు ప్రపంచమే మనందరి చేతుల్లోకి వచ్చిందన్నారు నేరెళ్ల శారద.