మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు వేణు కుమార్ అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో 2 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే నని ఈ విజయంతో స్పష్టమైంది అన్నారు.