ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు రావాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యాకన్న రాథోడ్ అన్నారు.స్టేషన్ ఘనపురం మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో యాకన్న మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో ఇవ్వకపోవడంతో పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆరోపించారు.