ఈనెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న స్థలంలో సభ నిర్వహించనున్నారు. సభ స్థలాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం అధికారులతో పలు అంశాలపై చర్చించారు.