ప్రజాపాలనలో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించిన ధర్మారం మండలం బంజేరుపల్లి తండ-బి గ్రామంలో ఇటీవల మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కొరకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. బంజేరుపల్లి తండా- బి లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, లబ్దిదారులకు అడ్లూరి లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపారు.