ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభ
NEWS Mar 07,2025 05:32 pm
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల సందర్బంగా ఏప్రిల్ 27న బహిరంగ నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ఎర్రవల్లి నివాసంలో జరిగింది. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైందని, దానిని గుర్తించి ప్రజా సమస్యలను ప్రస్తావించాలని పిలుపునిచ్చారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. పాలన గాడి తప్పిందని, జనం రేవంత్ ను సీఎంగా గుర్తించడం లేదన్నారు.