ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్
NEWS Mar 07,2025 04:32 pm
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున నాగబాబు కొణిదల శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాస్, విష్ణు కుమార్ రెడ్డి తో పాటు కొణతాల రామకృష్ణ, బోలిశెట్టి శ్రీనివాస్ బలపరిచారు. రిటర్నింగ్ అధికారి వనితారాణి కి నామినేషన్ పత్రాలు అందజేశారు నాగబాబు. ఈ సందర్బంగా ఆయనను అభినందించారు. నాగబాబు గెలుపు ఖాయమని తేలి పోయింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తనను కేబినెట్ లోకి తీసుకుంటానని వెల్లడించారు.