ఏపీ సర్కార్ మహిళలకు బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యా రాణి. ఉచిత బస్సు ప్రయాణంపై మాట మార్చారు. మహిళలకు ఫ్రీగా సౌకర్యం కల్పిస్తామని, కానీ ఆయా జిల్లాల వరకే పరిమితం చేశామన్నారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలంటే టికెట్లు తీసుకోవాల్సిందేనని ప్రకటించారు. దీనిపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మోసం చేయడంలో కూటమి సర్కార్ రాటు తేలిందన్నారు.