సీజనల్ హాస్టళ్ల పనితీరును మెరుగు పరుస్తాం
NEWS Mar 07,2025 01:39 pm
రాష్ట్రంలో సీజనల్ హాస్టళ్ల పనితీరును మెరుగు పరుస్తామని అన్నారు మంత్రి నారా లోకేష్. తాను యువగళం పాదయాత్ర చేపట్టిన సందర్బంగా ఆలూరు, ఆదోని ప్రాంతాల నుంచి వలస వెళ్లడం చూశానని అన్నారు. ఒకే వాహనంపై 200 మంది వెళ్లడం గమనించానని , అవన్నీ చూశాక తనకు బాధ కలిగిందన్నారు. ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేసి, సాగు, తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించడం జరిగిందన్నారు.