ఇంటి తాళలు పగలగొట్టి నగదు, బంగారం చోరీ
NEWS Mar 07,2025 12:56 pm
కొరుట్ల పట్టణంలో 33 వార్డులో గల మైలరపు అంజయ్య ఇంటిలో దొంగలు తాళాలు పగలగొట్టి సుమారు మూడున్నర తులాల బంగారం, 50 వేల నగదు చోరీ అయినట్టు బాధితుడు తెలిపారు. గత పది రోజుల కింద సమీప బంధువుల ఇంటికి తాళాలు వేసుకొని వెళ్లారు. కాగా గురువారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండగా, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి క్లూజ్ టీం తో దర్యాప్తు చేస్తున్నారు.