ఆర్టీసీ ఉద్యోగులకు సర్కార్ ఖుష్ కబర్
NEWS Mar 07,2025 11:18 am
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సంస్థలో పని చేసే డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు, ఇతర సిబ్బందికి 2.5 శాతం చొప్పున డీఏ ఇస్తున్నట్లు ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కరువు భత్యం ప్రకటనతో ప్రతి నెలా ఆర్టీసీ సంస్థపై రూ. 3.6 కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పారు. మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని ప్రకటించారు.