దివంగత మాజీ ఎంపీ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్ మెన్ రంగన్న అనుమానాస్పద మృతిపై లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఎమ్మల్సీ బీటెక్ రవి. ఇదే అంశంపై సంచలన కామెంట్స్ చేశారు కడప జిల్లా ఎస్పీ చెప్పారని తెలిపారు. ఆనాడు జగన్ సర్కార్ వివేకాపై గొడ్డలి పోటును గుండె పోటుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇదే సమయంలో దివంగత పరిటాల రవి హత్య కేసులో సాక్షులలో ఒక్కొక్కరిని నామ రూపాలు లేకుండా చంపేశారని మండిపడ్డారు. అదే విధంగా సాక్షులను లేకుండా చేస్తున్నారంటూ పేర్కొన్నారు.