దేశంలో ప్రతి గ్రామంలో 200 నుండి 300 మంది ఒంటరి మహిళలు అనేక ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నారని వారి సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం చేయాలని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రమ్మ ఫూలే వర్ధంతి సందర్భంగా బహుజన శ్రామిక మహిళలు అనే అంశంపై జరిగిన జిల్లా సదస్సులో జరిగింది.