మార్కెట్ యార్డును సందర్శించిన కలెక్టర్
NEWS Mar 06,2025 09:26 pm
మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. ఆరబోసిన పసుపు ధాన్యాన్ని పరిశీలించారు. పసుపు ధాన్యంను ఎలా కొనుగోలు చేస్తున్నారని, ఎక్కడికి రవాణా చేస్తున్నారని , మద్దతు ధర ఎలా ఉందని లాభనష్టాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. దళారుల నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు కలెక్టర్.