అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు
NEWS Mar 06,2025 09:31 pm
ముందస్తు అనుమతి లేకుండా పట్టా, ప్రభుత్వ భూముల నుండి మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గనులు, భూగర్భ శాఖ అడిషనల్ డైరెక్టర్ (ఏడీ) జైసింగ్ వార్నింగ్ ఇచ్చారు. .జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోరుట్ల మండలంలోని ఏకీన్పూర్ , అయిలాపూర్ గ్రామాలలోని మట్టి గుట్టలను పరిశీలించారు. అక్రమంగా మట్టిని తరలించే వారిపై అపరాధ రుసుం విధింపుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏడీతో పాటు మండల తహసిల్దార్ కిషన్, గిర్ధావర్ రాజేందర్ రావు, మండల సర్వేయర్ కుమార్ ఉన్నారు.