పసుపు మద్దతు ధర కోసం మహాధర్నా
NEWS Mar 06,2025 05:47 pm
మల్లాపూర్ మండల కేంద్రంలో జగిత్యాల జిల్లా రైతు వేదిక ఆధ్వర్యంలో పసుపు మద్దతు ధర కోసం మార్చి 11న మెట్ పల్లి పట్టణ కేంద్రంలో మహాధర్నకు రైతులందరూ పార్టీలకతీతంగా తరలి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి, పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ సంఘం మండల అధ్యక్షులు కళ్లెం మహిపాల్ రెడ్డి, కాసారం భూమారెడ్డి, డబ్బా రమేష్ రెడ్డి, ముద్దం సత్తన్న, సంఘ రాజన్న, సూర దివాకర్, పుండ్ర సోమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.