రాచన్న స్వామి వారిని దర్శించుకున్న సెట్విన్ చైర్మన్
NEWS Mar 06,2025 05:55 pm
జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహీర్ మండలం బడంపేట్ గ్రామంలో శ్రీ రాచన్న స్వామి జాతర మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. గిరిధర్ రెడ్డి శ్రీ రాచన్న స్వామి వారికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది , కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.