అన్న ప్రసాదంలో వడ వడ్డింపు
NEWS Mar 06,2025 04:26 pm
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. భక్తులకు మేలు చేకూర్చేలా అన్న ప్రసాదంలో మరో ఐటంను చేర్చింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో శ సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి టిటిడి ఛైర్మన్ భక్తులకు వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను బాధ్యతలు స్వీకరించాక అన్నంతో పాటు అదనంగా మరో పదార్థం వడ్డించాలనే ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు చెప్పానని, ఆయన ఓకే చెప్పారని తెలిపారు.