సాగు నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి
NEWS Mar 06,2025 04:08 pm
నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా సాగు నీటి సమస్య ఉత్పన్నమైతే, సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. విధుల పట్ల అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తూ సాగునీటి సరఫరాను సక్రమంగా పర్యవేక్షించక పోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోధన్ పట్టణంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి జిల్లా కలెక్టర్ ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.