పేకాట స్తావరంపై టాస్క్ ఫోర్స్ దాడి
NEWS Mar 06,2025 04:10 pm
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు పేకాటరాయలను అరెస్టు చేసి రూ.2450 నగదును , వాహనాలను స్వాధీనం చేసుకున్నామని నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపారు .నిజామాబాద్ ఇన్చార్జి సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ అంజయ్య , స్పెషల్ పార్టీ సిబ్బంది రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విటాళేశ్వర్ నగర్, రైస్ మిల్ పక్కన నిర్వహించ బడుతున్న పేకాట స్థావరంపై రైడ్ చేసి పేకాట రాయుళ్లతో పాటు 3 సెల్ ఫోన్స్ , 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.