నిజామాబాద్ కార్పొరేషన్లో రూ.90 కోట్లు ఆస్తి పన్ను
NEWS Mar 06,2025 02:34 pm
నిజామాబాద్ కార్పొరేషన్ పెండింగ్ బకాయిల మొత్తం రూ.90 కోట్లు కాగా, వాటిలో ఆస్తి పన్ను బకాయిలు రూ. 36.30 కోట్ల దాకా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 198 అసేస్మెంట్ల ద్వారా రావాల్సినవే కావడం గమనార్హం. వ్యవసాయ మార్కెట్ కమిటీ (10 అసేస్మెంట్లవి కలిపి) రూ. 60.94 లక్షలు, లా డిపార్ట్ మెంట్ (2 అసేస్మెంట్లవి ) రూ. 25 వేలు, ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ (6) రూ.20.81 లక్షలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఐబి) డిపార్ట్మెంట్ (5) రూ.13.66 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి .