టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ పరంగా ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ మేరకు ఆదేశించారని చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా కలిసికట్టుగా పార్టీ కోసం పని చేయాలని స్పష్టం చేశారన్నారు. ఇక పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురించి తాను కామెంట్స్ చేయదల్చు కోలేదన్నారు . ఇక ఎమ్మెల్యేల కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఇంకా జరగలేదన్నారు. రేపటి లోగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందన్నారు.