తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్
NEWS Mar 06,2025 08:08 am
కరీంనగర్ - అదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయుల కోసం ఎమ్మెల్సీగా గెలిచిన కొమురయ్య, అంజిరెడ్డి పోరాడుతారని అన్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాతే మాట్లాడాలని అన్నారు.